మల్కాజిగిరి, మే 8: మల్కాజిగిరిలో ఓ రైల్వే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఇంట్లోకి చొరబడిన ఓ వ్యక్తి కొబ్బరి బోండాం కత్తితో అతడి మెడ నరికేశాడు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్నగర్కాలనీకి చెందిన మద్ది విజయకుమార్రెడ్డి (30) రైల్వే లో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగి. ఆరేండ్ల కిందట వైజాగ్కు చెందిన భవ్యతో వివాహం జరిగింది. విజయకుమార్రెడ్డి తల్లి న్యూ సంతోష్రెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. ఆమెకు కరోనా రావడంతో రైల్వే ఆస్పత్రిలో చేర్చించి చికిత్స చేయిస్తున్నాడు. తన భార్యను పుట్టింటికి పంపించి.. తల్లి బాగోగులు చూసుకుంటున్నాడు. శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి తల్లి ఇంటికి వచ్చిన విజయకుమార్..గడియ పెట్టుకుని స్నానానికి వెళ్లే క్రమంలో.. గుర్తు తెలియని వ్యక్తి తలుపు తట్టడంతో డోర్ తీశాడు. ఆ వ్యక్తి విజయ్కుమార్రెడ్డి పై కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడు బయటి నుంచి గడియపెట్టి పరారయ్యాడు. మల్కాజిగిరి ఏసీపీ శ్యాంప్రసాద్రావు ఘట నా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు కేసు దర్యాప్తు చేపట్టారు.