దహెగాం, మార్చి 29: మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ శాశ్వత రోడ్లు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా దహెగాం మండలం పీకలగుండం గ్రామ సమీపంలో ఎర్రవాగుపై బ్రిడ్జి పనులు పూర్తిచేయించింది. ఇందుకు హర్షిస్తూ.. రైతు బంధు సమితి మండల కన్వీనర్ కంబగౌని సంతోష్గౌడ్ ఆధ్వర్యంలో వంతెనపై సీఎం కేసీఆర్, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఫ్లెక్సీలకు జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామరావు, నాయకులు పాలాభిషేకం చేశారు. కాంట్రాక్టర్ సుబ్రహ్మణ్యంను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సర్పంచ్లు బండ కృష్ణ, సందికట్ల రమేశ్, కారు రాజన్న, నాయకులు పురుషోత్తం, తుమ్మిడ మల్లేశ్, గజానన్, దందెర వెంకన్న, పాపయ్య, భీమన్న, నజీర్, రైతు రాజన్న, ప్రశాంత్, కారు అంజన్న, కాసారపు నాగేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రంగ్ బర్ సే.. హైదరాబాద్లో హోళీ సెలెబ్రేషన్స్
ఏప్రిల్ 1న జీహెచ్ఎంసీలో తాగునీటి సరఫరాకు అంతరాయం