పెద్దపల్లి : నిరుపేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పని చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన తమ్మిడవేణి అంజయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.3,40,000 లక్షల చెక్కులను మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
అలాగే మండలంలోని బొమ్మరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పి లచ్చయ్యకు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో దొంగతుర్తి గ్రామ సర్పంచ్ పాలకుర్తి సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీ దాడి సదయ్య, మాజీ సర్పంచ్ జుంజుపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.