హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్మికుంట పూసల సంఘం ఇప్పటికే గెల్లు అభ్యర్థిత్వాన్నిఆమోదించగా, జమ్మికుంట ఆటో యూనియన్ ఏకగ్రీవంగా శ్రీనివాస్ యాదవ్ కు ఓటేస్తామని తీర్మానం చేసింది.
ఈ సందర్భంగా జమ్మికుంట పూసల సంఘం అధ్యక్షులు ముద్రకోలా రమేష్ మాట్లాడుతూ..హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని, హుజురాబాద్ ఉపఎన్నికలో భారీ మెజార్టీ తో టీఆర్ ఎస్ ను గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జమ్మికుంట పూసల సంఘం ఉపాధ్యక్షుడు నాగిశెట్టి కిరణ్, ప్రధాన కార్యదర్శి నాగిశెట్టి కనకయ్య టీఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గోగికర్ సుధాకర్ వెంకన్న, రఘుపతి, సతీష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.