చార్మినార్, మే 20: కొవిడ్నుంచి కోలుకున్నా బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రాణాంతకంగా మారుతున్న తరుణంలో దీని నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయుష్ డైరెక్టర్ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. గురువారం చార్మినార్ యునానీ దవాఖానలో వర్షిణి మాట్లాడు తూ రోజురోజుకు విస్తృతమవుతున్న బాక్ల్ ఫంగస్ నిరోధానికి ప్రత్యేక కమిటీలను నియమించి ఔషధాలపై పరిశోధన చేయాలని సీఎం సూచించారని చెప్పారు. యునా నీ దవాఖానలోని ప్రొఫెసర్లు డాక్టర్ షహజాదీ సుల్తానా, ఎంఏ ఫారుఖీ, సయ్యద్ సలావుద్దీన్, ఎస్జేబీ బుఖారీ, జైబున్నిసా బృందం యునానీ వైద్య విధానంలో బ్లాక్ ఫంగస్ను అడ్డుకొనే మందులను గుర్తించిందని వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి కూడా పొందిన ఆ మందును గాంధీ, ఈఎన్టీ దవాఖానల్లో రోగులకు అందించామని తెలిపారు. యునానీ దవాఖానలో ఈ మందు అందుబాటులో ఉన్నదని తెలిపారు. వచ్చేవారం నుంచి రాష్ట్రంలోని అన్ని యునానీ దవాఖానల ద్వారా ఈ మందు ను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. యునానీలో బ్లాక్ ఫంగస్ను అడ్డుకునే మూడు మందులను గుర్తించామని యునా నీ ప్రొఫెసర్ డాక్టర్ బుఖారీ తెలిపారు. అల్క్ అజీబ్, హబ్-ఏ ముస్సఫీ, ఖమిరా అబ్రేహం మందులతో బ్లాక్ ఫంగస్ను నివారించవచ్చని వివరించారు.
1.అల్క్ అజీబ్: ఈ మందును టీ, కాఫీ, డికాక్షన్, పాలతోపాటు గోరు వెచ్చని నీటిలో రెండు చుక్కలు కలుపుకొని తాగాలి. దీనివల్ల నాసికా రంధ్రాల్లో దాగి ఉన్న వైరస్ నశిస్తుంది.