హైదరాబాద్: నగర శివార్లలోని కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. కీసర మండలంలోని యాద్దార్పల్లి వద్ద ఔటర్ రింగ్రోడ్డుపై ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.