ముంబై: టీమ్ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ భుజానికి ఈనెల 8న శస్త్రచికిత్స జరుగనుంది. ఈ విషయాన్ని క్రికెటర్ సంబంధిత వర్గాలు శుక్రవారం మీడియాకు వెలువరించాయి. గత నెలలో ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అయ్యర్ భుజానికి తీవ్ర గాయమైంది. గాయం కారణంగా ఐపీఎల్ 14వ సీజన్కు శ్రేయస్ పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.