రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై రెండు బైక్లు డీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దన్నపేట గ్రామ వాసి కడవ రామచంద్రం (45), ఇబ్రహీంనగర్ వాసి వానరాశి రమేశ్ (35) శనివారం రాత్రి 7.40 గంటల సమయంలో రామునిపట్ల గ్రామ శివారుల్లో రాజీవ్ రహదారిపై ఎదురెదురుగా బైక్లపై వెళుతున్నారు.
కడవ రామచంద్రం బైక్ను రమేశ్ అతివేగంతో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రమేశ్, రామచంద్రం అక్కడికక్కడే మరణించగా, ఈ ఘటనలో రామచంద్రం కూతురు, మనుమరాలికి గాయాలయ్యాయి. ఇద్దరి మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం కోసం సిద్దిపేట ప్రాంతీయ దవాఖానకు తరలించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పల్లాకు మొదటి ప్రాధాన్యతా ఓటు వేయాలి
- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు విజయవంతం
- నిబంధనల ప్రకారం ఎన్నిక నిర్వహించండి
- సామాజిక బాధ్యతగా టీకా తీసుకోవాలి
- మేడారం హుండీలు భద్రమేనా?
- ఉన్నొక్కటీ పనిరాదు
- ప్రజల అండతో టీఆర్ఎస్ బలోపేతం
- బంజారాలను గుర్తించింది కేసీఆరే..
- పల్లా గెలుపుతోనే సమస్యలు పరిష్కారం
- పల్లా రాజేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి