హైదరాబాద్: రాజధాని హైదరాబాద్లోని అమీర్పేటలో వృద్ధ మహిళల కిడ్నాప్ కలకలం సృష్టించింది. అమీర్పేటకు చెందిన అస్మత్ ఉన్సీసాబేగం, మహమ్మదీ అనే వృద్ధ మహిళలను దుండగులు అపహరించారు. వారిద్దరి చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి అమీన్పూర్లోని ఓ గదిలో నిర్భంధించారు. ఆ గదికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే కిటికీ వద్దకు వచ్చి రక్షించాలంటూ మహిళలు కేకలు వేయడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి వారిని కాపాడారు. అనంతరం అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు పాల్పడిన ప్రధాన నిందితుడితోపాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. ఆస్తికోసం మిరాజ్ అనే వ్యక్తి వారిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.