కార్పొరేషన్, మే 22: కరోనా సమయంలో పేదలకు ఉచితంగా భోజనం పెట్టి, ఆకలి తీర్చడం అభినందనీయమని మేయర్ వై సునీల్రావు కొనియాడారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శనివారం పురుషోత్తం, కొండయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ, మార్కెట్లో హమాలీలు, సిబ్బందికి అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రజలు స్వీకరించి, నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు. ఈ కష్టకాలంలో కూలీలు, దవాఖానల్లో రోగుల వెంట ఉండే బంధువులు, పేదలు తిండికి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ప్రకృతి ప్రేమికులు, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదల ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎలుక అనితాఅంజయ్య, మార్కెట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.