బదోహి : యూపీలోని బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిని కాల్చి చంపుతానంటూ బెదిరించిన బీజేపీ మాజీ ఆఫీస్ బేరర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఔరాయ్ ఎమ్మెల్యే దీనా నాథ్ భాస్కర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వినయ్ శ్రీవాత్సవను సాహుపూర్లోని చౌరీ ప్రాంతానికి చెందిన దీరేంద్ర దుభే సోమవారం రాత్రి ఫోన్లో బెదిరించాడని ఎస్పీ రామ్బదన్ సింగ్ తెలిపారు. ‘ దీరేంద్ర దుభే కాల్చుతానని బెదించడానికి ముందురోజు ఆయన కుమారుడు కిడ్నాప్కు గురయ్యాడు’ నా కాల్ రికార్డ్స్ ఆఫీస్ బేరర్స్తోపాటు ఎస్పీకి పంపాను’ అని ఎమ్మెల్యే దీనా నాథ్ భాస్కర్ మీడియా ఎదుట తెలిపారు.
ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరూ విషయంపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేదు. కాల్ రికార్డ్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. దీరేంద్ర దుభే కుమారుడు సత్యం (16) ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దీరేంద్ర దుభేను పార్టీ ఆరేండ్లపాటు సస్పెండ్ చేసింది. గ్యాంగ్స్టర్ వికాస్ దుభేకు అనుకూలంగా అతడు సోషల్ మీడియాలో పలు పోస్టులు సైతం పెట్టినట్లు శ్రీవాత్సవ తెలిపారు. వికాస్ దుభే గతేడాది కాన్పూర్లో పోలీస్ ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసిందే.