అమరావతి : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు తరగతులు ఉంటాయని.. అనంతరం మధ్యాహ్నం భోజనం ఉంటుందని వెల్లడించారు. ఎండల తీవ్రత, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.