న్యూఢిల్లీ : కేరళలోని ఎర్నాకులంలో ఆదివారం జరగాల్సిన రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రోడ్డు షో రద్దయ్యింది.
ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్కు వీలుకాకపోవడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఉదయం రాజ్నాథ్ సింగ్ తిరువనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను పుథుప్పాలీలో రోడ్డు షోలో పాల్గొని అనంతరం ఇరింజలకుడలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు తెలిపారు.
140 స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్న జరుగనున్నాయి. మే 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్న విషయం తెలిసిందే.