హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. ట్యాంక్బండ్ సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఇద్దరికి కరోనా సోకింది. ఐదో అంతస్తులోని చీఫ్ ఇంజినీర్ విభాగంలో ఇద్దరు ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో ఐదో అంతస్తును అధికారులు శానిటైజ్ చేయించారు. ఆ అంతస్తులో పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో ఇద్దరు బాధితులు మరణించారు. మొత్తం కేసుల్లో ప్రస్తుతం 3352 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 1395 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 111 కేసులు ఉన్నాయి.