నిర్మల్: జిల్లాలోని సారంగాపూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కౌట్ల (బీ)లో విద్యుదాఘాతంతో ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్కు విద్యుదలంకరణ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో నగేష్ (19) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
మరోఘటనలో శోభాయాత్ర సందర్భంగా డ్యాన్స్ చేస్తూ శేఖర్ (30) అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఒకే ఊర్లో, ఏకకాలంలో ఇద్దరు యువకులు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.