వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులు బొంరాస్పేట మండలానికి చెందిన శివ, మల్కయ్యగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..