మంచిర్యాల: రోడ్డుపై వెళ్తున్న ఓ బైక్పై పడుగు పడింది. పిడుగుపాటుకు ఇద్దరు యువకులు కాలి బూడిదయ్యారు. మంచిర్యాల రైల్వే వంతెన వద్ద బైక్పై పిడుగు పడింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు.