హైదరాబాద్ : కార్వీ చైర్మన్ పార్థసారథిని విచారణ నిమిత్తం రెండు రోజులు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఇవాళ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇండస్ ఇండ్ బ్యాంకు నుంచి దాదాపు రూ. 130 కోట్ల రుణం తీసుకున్న పార్థసారథి ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో బ్యాంకు ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఆయనను ఇటీవల అరెస్టు చేశారు. చంచల్గూడ జైలులో పార్థసారథి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీసీఎస్ పోలీసులు ఆయనను రేపు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. ఇదిలాఉండగా సీసీఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని పార్థసారథి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా పార్థసారథి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సీసీఎస్ పోలీసులు రీ-కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.