కేంద్ర చట్టాలెట్లున్నా కొనుగోళ్లు కొనసాగుతయ్
వారంలో ధాన్యం కొనుగోళ్లపై నిర్ణయం
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన
నెలరోజుల్లో చేతికి రానున్న వరి
హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు
నాగర్కర్నూల్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కేం ద్రం రైతుల వెన్ను విరిచే చట్టాలు తీసుకొచ్చినా.. రాష్ట్రంలో మాత్రం లబ్ధి చేకూర్చే విధానాలు అవలంభించేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో మార్కెట్లు, ధాన్యం కొనుగోళ్లను ఎప్పటిలాగే నిర్వహించనున్నట్లు సీఎం అసెంబ్లీలో చేసిన ప్రకటనతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట చేతికి వచ్చే సమయానికి వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది.
మార్కెట్లు, కొనుగోళ్లు యథావిధిగా..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలతో రై తాంగంలో ఆందోళన నెలకొన్నది. పంట ఉత్పత్తుల ను కొనుగోలు చేసే వేదికలై న మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల కొనసాగింపు గందరగోళంలో పడిం ది. కొనుగోలు కేంద్రాలు కూడా లేకపోతే రైతులు గ్రామ స్థాయిలో పండించిన పంటను అమ్ముకునేందుకు నానా పాట్లు పడాల్సి వచ్చేది. గతేడాది కరోనా సంక్షోభంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం గ్రా మ స్థాయి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆర్థి క భారమైనా భరించింది. ఈ క్రమంలో దీంతో ఈ ఏడాది మార్కెట్ యార్డులతోపాటు గ్రామ స్థా యిలోనూ ధాన్యం కొనుగోళ్లు జరగవనే సందేహాలను సీఎం కేసీఆర్ నివృత్తి చేశారు. సాక్షాత్తు అ సెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. పెండింగ్ ప్రాజెక్టులై న ఎంజీకేఎల్ఐ పూర్తవడంతో నాలుగేండ్లుగా గ్రా మాల్లో వరి సాగు విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు కేం ద్రాలకు తరలివస్తున్నది. యాసంగి పంట నెల రో జుల్లో చేతికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యం లో కొనుగోలు కేంద్రాల పునరుద్ధరణ దిశగా ప్ర భుత్వ ఆదేశంతో జిల్లా సివిల్ సైప్లె శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అదనపు కలెక్ట ర్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై చర్చించనున్నారు. గత యాసంగి సీజన్లో ఏ ర్పాటు చేసిన కేంద్రాలే ఖరారయ్యే అవకాశమున్నట్లుగా అధికారుల అంచనా. మార్కెట్ యార్డులను కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేయడం తో ఖరీదుదారులు, కాంటాదారులతోపాటు ఆ శా ఖ ఉద్యోగుల్లోనూ సంతోషం వ్యక్తమవుతున్నది. పంటల ఉత్పత్తి పెరగడంతో రూ.కోట్లాది నిధుల తో కొత్తగా మార్కెట్ యార్డులు, గోదాంలు నిర్మించారు. కేంద్ర చట్టంతో ఈ యార్డులు, గోదాంల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అయితే సీఎం ప్రకటనతో యార్డుల్లో సందడి నెలకొననున్నది.