మెదక్/వనపర్తి : కొవిడ్ పరీక్ష ఫలితాల్లో పాజిటివ్గా తేలడంతో తీవ్ర భయాందోళనకు గురై రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఇద్దరు పరీక్ష కేంద్రాల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
వివరాలివి.. మెదక్ జిల్లా తుప్రాన్ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓ మహిళకు కొవిడ్ లక్షణాలు ఉండటంతో మధ్యాహ్నం పరీక్ష చేయించుకునేందుకు తుప్రాన్ పరీక్ష కేంద్రానికి వచ్చింది.
వైద్య సిబ్బంది ఆమెకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో తీవ్ర భయాందోళనకు లోనై పరీక్ష కేంద్రంలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది.
వనపర్తి జిల్లా విపనగండ్ల గ్రామానికి చెందిన నర్సింహ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా ఉందన్న అనుమానంతో పరీక్ష చేయించుకునేందుకు స్థానిక ప్రభుత్వ దవాఖానకు వెళ్లాడు.
పరీక్షలో కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో బయటకు వచ్చి దవాఖాన ప్రాంగణంలోని మెట్లపై కూర్చున్నాడు. కాసేపటికి కూర్చున్నచోటే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.