చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 200 సీట్లు గెలుస్తుందన్న స్టాలిన్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నేత, సీఎం ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. స్టాలిన్ ఏమైనా జ్యోతిష్కుడా? అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేస్తారని, వారిదే తుది తీర్పు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి మంచి తీర్పు ఇస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కాగా, పుతియా తమిళగం పార్టీ తమతో లేదని పళనిస్వామి స్పష్టం చేశారు. ఆ పార్టీ తమని చాలా కాలం కిందట విడిచిపెట్టిందని చెప్పారు. అలాగే డీఎండీకే కూటమి నుండి నిష్క్రమించడం వల్ల ఎలాంటి నష్టం లేదనన్నారు. కూటమి నుంచి వైదొలగిన తర్వాత చెడుగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తామని అన్నాడీఎంకే జాయింట్ కోఆర్డినేటర్ అయిన పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.