సూర్యాపేట : జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలో గల పీహెచ్సీని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సందర్శించారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 12 పడకల ఆక్సిజన్ బెడ్ల ఏర్పాటు కోసం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ మాట్లాడుతూ.. కొవిడ్ టెస్టుల కోసం పీహెచ్సీల వద్ద ఆలస్యం జరుగకుండా చూడాలని, కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులకు తక్షణమే ప్రభుత్వ కిట్ అందించాలని తెలిపారు.
తుంగతుర్తి దవాఖానలో త్వరలోనే 12 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.
దవాఖానలో రికార్డులు పరిశీలించి అధికారులు సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దవాఖాన అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి