సిటీబ్యూరో, మే 23(నమస్తే తెలంగాణ): పెండ్లి చేసుకుంటానంటూ నమ్మించిన ఓ యువతి నగర యువకుడి నుంచి రూ.లక్ష కాజేసింది. ఆసీఫ్నగర్కు చెందిన ఓ యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పెండ్లి సంబంధాల కోసం మ్యాట్రీమోనీ సైట్లో తన బయోడెటా అప్లోడ్ చేశాడు. దీన్ని చూసిన ఓ యువతి తాము విజయనగరంలో ఉంటామంటూ మాట కలిపింది. పెండ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆమె తల్లితో కూడా మాట్లాడించి, పెండ్లి ఒప్పందం చేసుకున్నారు. ఇదంతా 9 నెలల కిందట జరిగింది. అప్పటి నుంచి కొన్నాళ్లు వాట్సాప్లో చాటింగ్ చేస్తూ వస్తున్నారు. తరుచు మా అమ్మకు అత్యవసరంగా కొన్ని డబ్బులు కావాలంటూ పలు మార్లు అడిగి.. బ్యాంకులో డిపాజిట్ చేయించుకుంది. ఒకసారి రూ. 20 వేలు.. మరో సారి రూ. 30 వేలు ఇలా మొత్తం రూ.1.08 లక్షలు వసూలు చేసింది. పెండ్లి ఎప్పుడంటే దాటవేస్తూ వస్తున్నారు. నిలదీయడంతో ఫోన్లు స్వీచాఫ్ చేశారు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు ఆదివారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.