పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన తుమ్మ రాకేశ్ బ్యాటరీతో నడిచే బైక్ను తయారుచేశారు. బీటెక్ ఈఈఈ చదివిన రాకేశ్ సింగరేణి జీడీకే-11వ గనిలో జనరల్ మజ్దూర్గా పని చేస్తున్నారు. పేదలకు, మహిళలకు అందుబాటులో ఉండేలా బ్యా టరీ బైక్ను రూపొందించారు. పుణె, కొల్కత్తా నుంచి తెప్పించిన 350 వాట్స్, 36 వోల్ట్ మోటర్, 42 వోల్ట్, 26 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీతో ఓ చిన్నపాటి బైక్ను తయారు చేశారు. గంట చార్జింగ్ పెడితే 70 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని, గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఈ బుల్లి బైక్ మహిళలకు చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు రాకేశ్. ఈ బైక్ తయారీకి కేవలం రూ.20 వేలు ఖర్చయిందని వివరించారు.
–కోల్సిటీ