హైదరాబాద్ : తెలంగాణ గిరిజన గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు సంబంధించే నిర్వహించే ప్రవేశ పరీక్షలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ కారణంగానే ప్రవేశ పరీక్షలను రద్దు చేశామన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలను.. పదో తరగతిలో వచ్చి గ్రేడ్ల ఆధారంగా జరుపుతామన్నారు. జూన్ 4వ తేదీ నుంచి విద్యార్థులు తమ గ్రేడ్లను సబ్జెక్టుల వారీగా సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించారు. ఇతర వివరాల కోసం http://tgtwgurukulam.telangana.gov.in/ను సంప్రదించొచ్చు.