హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులందరికీ నెలకు రూ.2 వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావా రవి పేర్కొన్నారు. ఇదే తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 15 వేల మంది విద్యావలంటీర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, డ్రాయింగ్ కోర్సుల పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లకు సైతం సాయం వర్తింపజేయాలని శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.
అభినందనీయం:ఎస్జీటీ ఫోరం
ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం ఆర్థికసాయం చేయడం అభినందనీయమని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం పేర్కొన్నది. విద్యావలంటీర్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సైతం ఇదే తరహా సాయం అందించాలని ఫోరం అధ్యక్షుడు ఖమ్రెద్దీన్ కోరారు