న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత లఖాన్ జార్కిహోలీ, తన సోదరుడైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సతీశ్ జార్కిహోలీకి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు అంగీకరించారు. కర్ణాటకలోని బెల్గావీ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగనున్నది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సతీశ్ జార్కిహోలీ పోటీలో ఉన్నారు.
ఈ విషయమై బీజేపీ సీనియర్ నేతలు జగదీష్ షెట్టార్, బైరాథి బసవరాజ్, ఉమేశ్ కట్టి, అన్నా సాహెబ్ జొల్లే తదితరులు లఖాన్ జార్కిహోలీ ఇంటికెళ్లి ఆయనతో చర్చించి తమ పార్టీలోకి రావాలని కోరారు. ఇప్పటికే బీజేపీలో ఉన్న తన సోదరులు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోలీ, బాలచంద్ర జార్కిహోలీలతో చర్చించిన తర్వాత ఆ పార్టీలో చేరేందుకు తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
బీజేపీ నేతల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని బెల్గావీలో బీజేపీ అభ్యర్థి మంగళ అంగాడీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. నన్ను బీజేపీలో చేరాలని వారు నన్ను కోరారు అని లఖాన్ జార్కిహోలీ తన నివాసం వద్ద మీడియాతో చెప్పారు.
ఈ నెల 17వ తేదీన జరిగే లోక్సభ ఉప ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని బీజేపీ అభ్యర్థి మంగల అంగాడీ, తన కూతురుతో కలిసి లఖాన్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సెల్ఫీ దిగుతుంటే ఫోన్ లాక్కున్న అజిత్..వీడియో హల్చల్
జల్సా సినిమా గుర్తు చేస్తున్న వకీల్ సాబ్ కొత్త పోస్టర్
వకీల్ సాబ్ ప్రమోషన్లో శృతి హాసన్ కనిపించడం లేదే..?