హైదరాబాద్: రాష్ట్రంలోని పలు బస్టాండ్లలో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయని అందిన ఫిర్యాదులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, ఒప్పందం రద్దుకు నోటీసులు పంపినట్లు ఆయన వెల్లడించారు.
ఉచిత మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసిన వారికి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. బస్టాండ్లలోని స్టాళ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడతామని తెలియజేశారు.
సూర్యాపేట, నల్గొండ, కరీంనగర్, వరంగల్, హన్మకొండల్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వారికి రూ.52 వేల జరిమానాతోపాటు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.