హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీ జనార్దన్ రెడ్డితోపాటు ఏడు సభ్యులు ఇవాళ ప్రయాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉదయం 10 గంటల 45 నిమిషాలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖాళీగా ఉన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవితోపాటు కమిషన్ సభ్యుల పదవులను రెండురోజుల క్రితం సీఎం కేసీఆర్ భర్తీ చేసిన విషయం తెలిసింది.
వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నసీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్ను చైర్మన్గా నియమించారు. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కారం రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, రిటైర్డ్ ఈ ఎన్సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రొఫెసర్ బీ లింగారెడ్డి, ఎస్డీసీ కోట్ల అరుణ కుమారి, ఆచార్య సుమిత్రా ఆనంద్ తనోబా, ఆయుర్వేద వైద్యులు అరవెల్లి చంద్ర శేఖర్ రావులకు సభ్యులుగా అవకాశం దక్కింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.