వరంగల్ రూరల్ : రాఫ్ట్రంలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమం ప్రారంభించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలపై, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై గ్రామసభలో సమీక్షించారు.
పారిశుధ్యం, పచ్చదనంతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలతో గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెలుతుందన్నారు.
అందులో భాగంగానే ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పల్లె ప్రగతి కార్యక్రమంతో ఇప్పటికే గ్రామాల్లో గణనీయమైన అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి..
వెదజల్లే పద్దతిలో వరి సాగుతో అధిక లాభాలు : మంత్రి హరీశ్ రావు
బైక్ అదుపుతప్పి కల్వర్టులో పడి వ్యక్తి మృతి
పల్లెప్రగతి పనులను పరిశీలించిన మంత్రి వేముల
వనపర్తి జిల్లాలో నూతన కోర్టులు ప్రారంభం
ల్యాబర్తిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆరూరి