రామంతాపూర్, మే 2 : ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రంజాన్ తోఫాను రామంతాపూర్ ఉస్మానియా వెల్ఫేర్ సొసైటీ మసీదు, ప్రధాన రహదారిలో ఉన్న కుత్బుషాహి మసీదుల్లో ముస్లిం సోదరులకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రభుత్వం ముస్లిం సోదరులకు తనవంతు చేయూత అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం రామంతాపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా ముస్లింలకు తోఫా అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గంధం జోత్స్ననాగేశ్వర్రావు, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, టీఆర్ఎస్ నాయకులు గడ్డం రవికుమార్, గంగిడి కృష్ణారెడ్డి, సూరం శంకర్, మసీద్ కమిటీ సభ్యులు, ఎండీ సమద్, కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీజ్ సయ్యద్, మహ్మద్ తౌఫిక్, ఖుర్షీద్ హుస్సేన్, ముస్టిం సోదరులు పాల్గొన్నారు.
మల్లాపూర్, మే 2 : మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదరులకు పంపిణీ చేస్తున్న దుస్తులను ఆయన ఆదివారం మల్లాపూర్ డివిజన్ పరిధి గోకుల్నగర్, గ్రీన్ హిల్స్కాలనీ మసీద్ల వద్ద కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో అష్రాఫ్, వికార్, హుసేన్, ఖాసీం, అక్బర్, రహమాన్, రషీద్, సర్ఫుద్దీన్, జావిద్, మైనార్టీ నాయకుడు అల్తాఫ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్గౌడ్, పీఆర్. ప్రవీణ్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ పరిధిలోని న్యూ నర్సింహనగర్లోని మసీద్, అబూతాలిబ్ మసీద్ వద్ద ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ ప్రభుదాస్ ముస్లిం సోదరులకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గడ్డం రవికుమార్, కృష్ణారెడ్డి, నాగరాజ్, నిస్సార్, బాల్రాజు, శ్యాం, శ్రీకాంత్, శేఖర్గౌడ్, మంజుల, మసీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.