మంత్రి సత్యవతి రాథోడ్
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ దేశానికే తలమానికంగా నిలిచిందని ఆ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు లబ్ధ్దిదారులకు సమర్థంగా చేరవేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ సిబ్బంది, శిక్షణా వ్యవహారాల విభాగం ‘అందరికీ శిక్షణ’లో భాగంగా రాష్ట్రంలోని గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగులు, సిబ్బందికి ‘సమగ్రశిక్షణ’ నిర్వహించింది. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో మొత్తం 6,740 మంది శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిని మాసబ్ట్యాంక్లోని దామోదరం సంజీవయ్యభవన్లో గురువారం మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తూ దేశంలోనే టాప్లో నిలుస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.