Telangana
- Nov 26, 2020 , 17:09:06
రాజకీయ నేతలకు ఈసీ వార్నింగ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పలువురు రాజకీయ నాయకులు మత విద్వేశాలు రెచ్చగొట్టేలా, వ్యక్తిగత దూషణలు చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దృష్టిసారించింది. పలువురు నేతలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రసంగించినట్లు ఎస్ఈసీ గుర్తించింది. రాజకీయ పార్టీ నేతల ప్రసంగాలపై హెచ్చరికలు జారీ చేసింది. ఇంటింటి ప్రచారం, రోడ్షోలు, ర్యాలీల్లో కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కొందరు నేతలు వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. మీడియా ద్వారా అన్నింటినీ గమనిస్తున్నాం. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ప్రసంగిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ప్రచారంలో అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. మోడల్ కోడ్ను ఉల్లంఘిస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్ఈసీ హెచ్చరించింది.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING