హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన టీఎస్ఆర్టీసీ తిరిగి గాడిలో పడుతున్నది. కార్మికుల వేతనాలతో సహా ఇతర బకాయిలు ఒక్కొక్కటిగా చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి సహకారం లభించడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. నూతన ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పనుల్లో మరింత వేగం పెరిగిందన్న ఆశాభావం కార్మికుల్లో వ్య క్తమవుతున్నది. నెలవారీ వేతనాలు సైతం అటు అన్ని జో న్లు, బస్భవన్ ఉద్యోగులందరి ఖాతాల్లో బుధవారం సాయం త్రానికి చేరాయి. ప్రభుత్వ గ్యారెంటీతో ఇప్పటికే ఆర్టీసీకి రూ.500 కోట్ల రుణం వచ్చింది. ఇందులోంచి రూ.110 కోట్లు టీఎస్ఆర్టీసీ క్రెడిట్ సొసైటీకి కేటాయించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు 2018 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపునకు రూ.2 కోట్లు కేటా యించారు. ఉద్యోగుల పీఎఫ్ బకాయిలు, మ్యారేజీ లోన్లు, మెడికల్ లోన్లు సైతం సర్దుబాటు చేసినట్టు తెలిసింది. స్టాఫ్ రిటైర్మెంట్ స్కీంలో మాజీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడునెలల బకాయిలను చెల్లించారు. తార్నాక ఆర్టీసీ దవాఖానకు కొంత మొ త్తాన్ని ఇచ్చారు. అద్దెబస్సుల బకాయిలను కొంత చెల్లించినట్టు తెలిసింది. దీంతో కార్మికుల్లో ఆనందం వ్యక్తం అవుతున్నది. రోజువారీగా ఆదాయం రూ.9 కోట్లకు చేరుతున్నది. ప్రయాణికుల సంఖ్యలోనూ పెరుగుదల నమోదవుతుండం సంతోషాన్నిస్తున్నదని అధికారులు, కార్మికులు అంటున్నారు.
కార్మికుల్లో భరోసా పెరుగుతున్నది
ఆర్టీసీ కార్మికుల వేతనాలతోపాటు పలురకాల బకాయిల చెల్లింపునకు సానుకూల నిర్ణయా లు తీసుకుంటుండటంతో మా లో భరోసా పెరుగుతున్నది. కార్మికులంతా మరింత కష్టపడి పనిచేసేందుకు ఉత్సాహంగా ముం దుకు వస్తున్నారు. సీఎం కేసీఆర్, రవాణాశాఖ మంత్రి పు వ్వాడ అజయ్కుమార్, నూతన ఎండీ వీసీ సజ్జనార్లకు కార్మికుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.