హైదరాబాద్ : సాంఘిక సంక్షేమ ఇంటర్ కాలేజీల ప్రవేశ పరీక్ష రద్దు అయింది. కరోనా ఉధృతి నేపథ్యంలో టీఎస్ ఆర్జేసీ సెట్ను రద్దు చేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. పదో తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటర్లో ప్రవేశాలు చేపడుతామని తెలిపారు. ఈ నెల 7వ తేదీ లోపు మార్కులు అప్లోడ్ చేయాలని సూచించారు. www.tswreis.in వెబ్సైట్లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.