హైదరాబాద్ : టీఎస్ పాలిసెట్ -2021 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలను వెల్లడించనుంది. ఫలితాలకు ఒక్కరోజు ముందే పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను సైతం సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. వచ్చే నెల 5 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.