కోహీర్, ఏప్రిల్ 13 : గోమాతను సంరక్షించేందుకు గోశాలలు ఏర్పాటు చేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. మంగళవారం కోహీర్ మండలంలోని బడంపేట రాచన్నస్వామి దేవాలయం ఆవరణలో ఎమ్మెల్యే మాణిక్రావుతో కలిసి గోశాల ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గోమాతను కాపాడేందుకు ప్రజలు ముందుకు రావాలని అన్నారు. గోశాలకు తాగునీరు, మేత సరఫరా చేసేందుకు దేవాలయ పాలకమండలి కృషి చేయాలన్నారు. పశువులు అంతరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనిఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ పాలక మండలి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.