హైదరాబాద్ : రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా జూన్ 5వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని కన్వీనర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు https://pecet.tsche.ac.in/ వెబ్సైట్ ద్వారా తమ అప్లికేషన్లను సమర్పించవచ్చని వెల్లడించింది. రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీలకు రూ.400, ఇతరులు రూ .800 చెల్లించాల్సి ఉంటుంది.