హైదరాబాద్ : బీపెడ్, డీపెడ్లో ప్రవేశాలకు నిర్వహించే ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్-2021) రిజిస్ట్రేషన్ గడువు మరోమారు పొడిగింపబడింది. ఎటువంటి అపరాద రుసుం లేకుండా జులై 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు https://pecet.tsche.ac.in/. వెబ్సైట్కు లాగినై దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటివరకు బీపెడ్కు 1,720 మంది అభ్యర్థులు అదేవిధంగా యూజీ డీపీఎడ్ కోర్సుకు 1,309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.