ముదిరాజ్ భవన నిర్మాణానికి మంత్రుల భూమిపూజ

హైదరాబాద్ : బీసీల ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో భాగంగా కోకాపేటలో ముదిరాజ్లకు కేటాయించిన 5 ఎకరాల స్థలంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కేశవ్రావు, బండ ప్రకాశ్, రంజిత్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీసీల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా కోకాపేటలో 13 కులాలకు, ఉప్పల్ భగాయత్లో 25 కులాలకు, మల్కాజ్గిరి, బాట సింగారంలో 40 కులాలకు 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా భవన నిర్మాణాలకు గాను రూ.95.25 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. త్వరలోనే అన్ని కులాల భవన నిర్మాణాలు ప్రారంభం కానున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Laid foundation for the construction of Mudiraj Community self-respect building with an estimation of Rs 5 Crore along with MP K Keshava Rao Garu, Colleague Ministers @Eatala_Rajender Garu, @YadavTalasani Garu, @SabithaindraTRS Garu, Leaders and officials at Kokapet pic.twitter.com/npz4Ejjo3T
— Gangula Kamalakar (@GKamalakarTRS) January 10, 2021
తాజావార్తలు
- బాటసింగారంలో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం
- 12 నెలల్లో 3 సినిమాలు..పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!
- బీజేపీ బోగస్ మాటలను నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి
- గంగానది ప్రశాంతత మంత్రముగ్ధం : ఎమ్మెల్సీ కవిత
- 'విరాటపర్వం' విడుదల తేదీ ఖరారు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ