ముంబై: తాజాగా కొవిడ్-19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం (మార్చి 28) నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత రికార్డులను అధిగమించి కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
పెరిగిపోతున్న కరోనా కేసులప సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్లతో చర్చించారు. కొత్తవారికి కరోనా సోకకుండా రాత్రి పూట కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపింగ్ మాల్స్ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు మూసి ఉంచుతారు.
కరోనా ముప్పు తొలగిపోలేదని, అంతకంతకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. ఈ అంశాన్ని ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. దీని ఆట కట్టించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి లాక్డౌన్ విధించాలా? వద్దా? అన్న విషయమై జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే, ప్రజలకు సరిపడా వ్యవధి ఇస్తారని చెప్పారు.
మా వాదనే నిజమైంది.. సుప్రీం తీర్పుపై రతన్ టాటా!
ధరలకనుగుణంగా ముడి చమురు దిగుమతి పాలసీ: ధర్మేంద్ర ప్రధాన్
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!