వరంగల్ : టీఎస్ ఐసెట్ -2021 ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గురువారం ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఫలితాల్లో 90.09 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఫలితాలతో పాటు తదితర వివరాల కోసం https://icet.tsche.ac.in/ వెబ్సైట్ను సందర్శించొచ్చు.