మహబూబ్నగర్ టౌన్, మార్చి 20 : దేశంలోనే మొట్టమొదటి లిథియం అయాన్సెల్ తయారీ చేసేందుకు మహబూబ్నగర్కు న్యూ ఎనర్జీ పార్క్ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. దివిటిపల్లి వద్ద సూమరు 400 ఎకరాల్లో మంత్రి కేటీఆర్ ప్రారంభించిన ఐటీ, మల్టీ పర్పస్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. టవర్, మూడు ఫ్లోర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. అదనంగా మరో రెండు ఫోర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేయడంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ.40 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ టవర్ ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అన్ని రంగాల్లో మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతుందన్నారు.