వరంగల్ అర్బన్ : వరంగల్ నగరంలోని గంగా హాస్పిటల్లో ఆరోగ్య శ్రీ సేవలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుపేదల కోసం ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సేవలను హాస్పిటల్స్ కేవలం వ్యాపారంగా గాక, సేవా దృక్పథం తో పని చేయాలని మంత్రి సూచించారు. సేవ చేసే వారిని ప్రజలు ఎల్లప్పడు గుర్తుంచుకుంటారన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.