హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 100 శాతం వ్యాక్సినేషన్కు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు 18 ఏండ్లు నిండిన విద్యార్థులందరికీ టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యా సంస్థల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయితే.. ప్రత్యేకంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రధానోపాధ్యాయులు పీహెచ్సీలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. వ్యాక్సినేషన్ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని.. సెప్టెంబర్ 10 నాటికి 100 శాతం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించింది. సంబంధిత శాఖల అధికారులు వ్యాక్సినేషన్పై క్షుణ్ణంగా సమీక్షించి, రోజు వారిగా నివేదికలు అందజేయాలి అని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.