దేశంలో ఎక్కడాలేనన్ని పథకాలు అమలు
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
లక్షెట్టిపేట రూరల్, మార్చి 19 : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన వరమని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోనే అమలవుతున్నాయని స్పష్టం చేశారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో 106 మంది లబ్ధిదారులకు రూ.1,06,12,296 విలువ గల చెక్కులను అందజేశారు. ఆరేళ్లుగా ప్రతి పంటకూ గూడెం లిఫ్ట్ ద్వారా 1.5 టీఎంసీల నీటిని అందిస్తున్నామన్నారు. గూడెం లిఫ్ట్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ కొందరు తమ స్వార్థం కోసం అనవసర ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, జడ్పీటీసీ ముత్తె సత్తన్న, తహసీల్దార్ వేముల రాజ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, సీనియర్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు చాతరాజు రాజన్న, ఓరగంటి శ్రీకాంత్, లావుడ్య సురేశ్ నాయక్, దొంత నర్సయ్య, గరిసె రవీందర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హాజీపూర్లో 68 మందికి చెక్కులు..
మంచిర్యాల అర్బన్(హాజీపూర్), మార్చి 19 : హాజీపూర్ తహసీల్ కార్యాలయంలో 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే దివాకర్రావు పంపిణీ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కూడా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.2,750 కోట్లు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, మండలాధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, రాపల్లి సర్పంచ్ ఆనె మల్లేశ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్లో 89 మందికి..
సీసీసీ నస్పూర్, మార్చి 19 : సీసీసీ ఆఫీసర్స్ క్లబ్లో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లపల్లి, నస్పూర్, తీగల్పహాడ్, సింగాపూర్కు చెందిన 89 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్, కమిషనర్ రాజలింగు, పార్టీ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు బోయ మల్లయ్య, బండి పద్మ, పూదరి కుమార్, పంబాల గంగా, బెడికె లక్ష్మి, కుర్మిళ్ల అన్నపూర్ణ, చిడం మహేశ్, రేగుంట చంద్రశేఖర్, సుర్మిళ్ల వేణు, కోఆప్షన్ సభ్యులు నాసర్, ముత్తె రాజేశం, నాయకులు కమలాకర్రావు, జక్కుల రాజేశం, పెరుమాళ్ల జనార్దన్, దెబ్బటి రామన్న, దగ్గుల మధుకుమార్, జాడి భానుచందర్, కాటం రాజు, చల్ల విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.