న్యూఢిల్లీ: ఇది కరోనా కాలం.. అందునా రెండో వేవ్ విజ్రుంభిస్తున్నది. దీంతో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా గోల్డ్వైపు చూస్తున్నారు. ఫలితంగా గురువారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో తులం బంగారం ధర రూ.49, 315 పలికింది.. అంటే రూ.50 వేలకు చేరువలోకి వచ్చేసింది. గురువారం ఎంసీఎక్స్ మార్కెట్లో తులం బంగారం ధర 48,195 పలికింది. బుధవారం సెషన్లో ఇదే 10 గ్రాముల బంగారం ధర రెండు నెలల గరిష్టానికి చేరుకుని రూ.48,200గా రికార్డయింది. మరోవైపు కిలో వెండి ధర రూ.70,310గా నమోదైంది.
ఏది ఏమైనా భారత మార్కెట్లో తులం బంగారం ధర ఈ నెలలోనే రూ.4000కి పైగా పెరిగింది. ఈ నెలారంభంలో తులం బంగారం రూ.44 వేల వద్ద తచ్చాడింది. తర్వాత యూఎస్ బాండ్లతోపాటు డాలర్ బలహీన పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి.
పరిస్థితులు ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ నాటికి తులం బంగారం ధర మరోమారు రూ.50 వేల మార్కును దాటుతుందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా మాట్లాడుతూ కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతుండటంతో సెప్టెంబర్ నాటికి తులం బంగారం ధర రూ.50 వేలు దాటుతుందన్నారు. పరిస్థితి మరింత విషమిస్తే తులం బంగారం ధర మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుందని చెప్పారు.
ప్రుథ్వీ ఫిన్ మార్ట్ డైరెక్టర్ మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ అనిశ్చిత వాతావరణంలో స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నప్పుడు బంగారం ధర పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా డాలర్ విలువ పడిపోయినా, రూపాయి మారకం విలువ పతనమైనా బంగారం ధర పైపైకి దూసుకెళ్తుందన్నారు.
పరిస్థితుల్లో తేడాను గమనించిన చైనా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోనున్నది. మున్ముందు బంగారం, వెండి ధరలు పెరుగుతాయని చైనా బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే చైనా బంగారం వినియోగానికి అతిపెద్ద మార్కెట్. చైనా తర్వాత స్థానంలో ఉన్న భారత్ ఏటా 700-800 టన్నుల బంగారాన్ని వాడుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,773 డాలర్లుగా ఉన్నది. ఈ నెల ఒకటో తేదీన 1730 డాలర్లు మాత్రమే. దీని ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలలోనే బంగారం ధర మూడు శాతం పెరిగింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బంగారం దిగుమతి 471 శాతం పెరిగింది. మార్చి నెలలోనే 160 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయ్యింది. ఇది 2020 మార్చితో పోలిస్తే 471 శాతం ఎక్కువ.
మార్చిలో ముగిసిన త్రైమాసికంలో భారత్ 321 టన్నులు దిగుమతి చేసుకుంది. గతేడాది మార్చి త్రైమాసికంలో కేవలం 124 టన్నులు మాత్రమే దిగుమతి చేసుకున్నది.
18 ఏళ్లు నిండిన వారికి ఈ నెల 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్
అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్ సిలిండర్ల సీజ్
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట విషాదం..
నెగెటివ్ వచ్చినా.. బయటినుంచి వస్తే క్వారంటైన్కే
‘ప్రాణ’గండం!! .. ఊపిరాడని ఉత్తరాది
కొవిషీల్డ్ ధరల్లో తేడాలెందుకు? అందరికీ వ్యాక్సినేషన్ అక్కర్లేదా?!
అసలు ఓ ప్లాన్ ఉందా.. ఆక్సిజన్, వ్యాక్సినేషన్పై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం