హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. క్వారీ గుంతలోకి దూకి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. జగద్గిరిగుట్ట పరిధిలోని బాలయ్యనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను ఎల్లమ్మబండ ఎన్టీఆర్నగర్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
రెండురోజుల క్రితం ప్రేమికులిద్దరూ ఇంట్లో నుంచి అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు వీరి ఆచూకీ కోసం ప్రయత్నిస్తుండగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసి విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.