హైదారాబాద్కు వచ్చిన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన గౌరవార్ధం శుక్రవారం రాజ్భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ దంపతులు హాజరయ్యారు. ఈ విందుకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు హాజరయ్యారు.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వీ రమణ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వచ్చారు.మూడు రోజులపాటు రాజ్భవన్ అతిథిగృహంలో బస చేయనున్నారు.