ప్రజాహిత వ్యాజ్యాన్ని మూసేసిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కోర్టు ధికార కేసుల్లో రైతులకు భూసేకరణ పరిహారం చెల్లింపునకు రూ.58.95 కోట్ల మంజూరు నిమిత్తం జారీచేసిన 208 జీవో సవరణకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. జీవో ఉద్దేశాలను వివరిస్తూ సీఎస్ దాఖలుచేసిన అఫిడవిట్నే పరిగణనలోకి తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టును కోరారు. దీంతో నిధులను విడుదల చేయవద్దంటూ గతంలో జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. 208 జీవోను స వాల్ చేస్తూ దాఖలైన పిల్ను మూసేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.